వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజా హెగ్డే జంటగా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అతడు , ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB28 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హైదరాబాద్ లో రూపొందించిన ప్రత్యేక సెట్ లో భారీ యాక్షన్ సీన్ తో #SSMB28 మూవీ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 12 వ తేదీ ప్రారంభం అయిన విషయం తెలిసిందే.ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ లో పలు యాక్షన్స్ సీన్స్ దర్శకుడు తెరకెక్కించారు. రెండవ షెడ్యూల్ ప్రారంభం అయిన 3 రోజులకు మహేష్ బాబు మదర్ మృతిచెందడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. తాజాగా ఈ మూవీ తాజా షెడ్యూల్ జనవరి 3 వ వారంలో ప్రారంభం కానుందని సమాచారం. #SSMB28 మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ కై త్రివిక్రమ్ శ్రీనివాస్ , మహేష్ బాబు , థమన్ ఎస్ , నాగవంశీ దుబాయ్ చేరుకున్నారు. అక్కడ 10 రోజులపాటు మ్యూజిక్ సిట్టింగ్స్ జరగనున్నాయని సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: