మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . బిజూ మీనన్ , మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి , శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వాల్తేరు వీరయ్యలో చిరంజీవితో కలిసి బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా పై తెరకెక్కిన ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ సాంగ్ ప్రోమో ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా విడుదలై ప్రోమోతో సాంగ్ పై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తుండగా.. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా ఈ సాంగ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం విశేషం. హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న వాల్తేరు వీరయ్య సెట్స్ ను దర్శకుడు క్రిష్ మరియు నిర్మాత ఏఎమ్ రత్నంతో కలిసి పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఈ రోజు విడుదల కానున్న బాస్ పార్టీ ఫుల్ సాంగ్ ను చూసి పాజిటివ్ కామెంట్స్ చేశారు. బాస్ పార్టీ సాంగ్ అద్భుతంగా ఉందని, ట్యూన్, లిరిక్స్ పై సంతృప్తి వ్యక్తం చేశారు. అన్నయ్య తో బాస్ పార్టీ సాంగ్ ను ఎంజాయ్ చేస్తున్న తమ్ముడు అంటూ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ట్వీట్ చేసింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: