డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ – రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ అంటే ఆ క్రేజ్ వేరే ఉంటుంది కదా. అలాంటి క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన సినిమా లైగర్. అయితే ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మరోవైపు ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా బయ్యర్లు భారీ ధరకే రైట్స్ ను కొనుగోలు చేశారు. ఈసినిమా పరాజయంతో బయ్యర్లకు నష్టాలు వచ్చాయి. ఇక ఈనేపథ్యంలో పూరీ జగన్నాథ్ బయ్యర్లు మధ్య వివాదాలు కూడా తలెత్తాయి. ప్రస్తుతం అయితే ఈ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ఫెయిల్యూర్ పై మొదటిసారిగా స్పందించాడు విజయ్ దేవరకొండ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ లైగర్ సినిమా గురించి మాట్లాడుతూ.. లైగర్ ఫ్లాప్ ఒక వ్యక్తిగా తనను మార్చిందని.. విజయ్ దేవరకొండ ఎవరో తెలుసుకున్నానని తెలిపాడు. అతని రేంజ్ ఎంత? అతని సత్తా ఏంటో? నాకు చాలా ముఖ్యమైన సమాధానాలు వచ్చాయి అని చెప్పాడు.
ఇక ప్రస్తుతం అయితే విజయ్ దేవరకొండ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతతో కలిసి ఖుషి సినిమా చేస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో కశ్మీర్ బ్యాక్డ్రాప్లో బ్యూటీఫుల్ లవ్స్టోరీగా ఈ సినిమా రూపొందుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై వై.రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అయితే ముందు ఈసినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు.. కానీ షూటింగ్ లేట్ అవ్వడంతో ఈసినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: