టాలీవుడ్ యంగ్ సంతోష్ శోభన్ బాలనటుడిగా పలు సినిమాల్లో చేసినా హీరోగా పరిచయమై పేపర్ బాయ్, మంచి రోజులు వచ్చాయి, ఏక్ మినీ కథ సినిమాలతో మంచి పేరును సొంతం చేసుకున్నాడు సంతోష్ శోభన్. ఇక జాతి రత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి హీరోయిన్ గా పరిచయం అయింది ఫరియ అబ్దుల్లా. మొదటి సినిమాలోనేతన న్యాచురల్ యాక్టింగ్ తో అందరినీ ఫిదా చేసేసింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైక్, షేర్ అండ్ సబ్ స్క్రైబ్. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాలో సంతోష్ శోభన్ ట్రావెలర్ వ్లోగర్ గా కనిపించనున్నాడు. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. నేను ప్రభాస్ కు డై హార్డ్ ఫ్యాన్ ను ఇప్పటికే కాదు ఎప్పటికీ నేను ప్రభాస్ అభిమానినే అంటూ స్పష్టం చేశాడు. చాలా మందికి తెలీదు ప్రభాస్ అన్ననే యూవీ క్రియేషన్స్ లాంటి ప్రముఖ సంస్థకు నన్ను రికమెండ్ చేసి ఏక్ మినీ కథ లాంటి సక్సెస్ ను అందించి మంచి బ్రేక్ ను ఇచ్చాడు అని తెలిపాడు.
కాగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సుదర్శన్, సప్తగిరి, మైమ్ గోపి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిహారికా ఎంటర్టైన్ మెంట్-ఆముక్త క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 4న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.
ఇక సంతోష్ శోభన్ కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన సపోర్ట్ ను మొదటి నుండీ అందిస్తున్న సంగతి తెలిసిందే. తన కెరీర్ లో మొదటి బ్లాక్ బస్టర్ వర్షం సినిమాను అందించిన శోభన్ తనయుడు సంతోష్ శోభన్. శోభన్ తో ప్రభాస్ కు మంచి రిలేషన్ ఉంది. అయితే ప్రస్తుతం శోభన్ లేకపోవడంతో ప్రభాస్ మాత్రం తన ఫుల్ సపోర్ట్ ను ప్రభాస్ కు అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: