నా సినిమాను ఎవరు ఆపుతారో చూస్తా అంటున్నాడు రౌడీహీరో విజయ్. అది ఏ సినిమానో అర్థమైపోయింది కదా. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. ఒకవైపు ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి తగ్గట్టే మరోవైపు మేకర్స్ కూడా వీలైనంత బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇవన్నీ ఒకటైతే మరోవైపు ఈసినిమాకు కరణ్ జోహార్ వల్ల బాయ్ కట్ సెగ తగిలింది. గత కొద్దిరోజులుగా ఈసినిమాను బాయ్ కట్ చేయాలని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇక ఇప్పటికే విజయ్ దేవరకొండ దీనిపై స్పందిస్తూ ముందు మంచిగానే సమాధానం చెప్పాడు. ఎంతోమంది సినీ కార్మికులకు నష్టం కలుగుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. వివాదం మరీ ఎక్కువ అవుతుండటంతో ఆ తరువాత తన ట్విట్టర్ ద్వారా కాస్త సీరియస్ గానే స్పందిస్తూ మనం కరెక్ట్ అయినప్పుడు ఎవరి మాట వినక్కర్లేదు అంటూ సమాధానం ఇచ్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ వివాదం పై మరోసారి స్పందించిన విజయ్ కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న విజయ్.. నాకు బ్యాక్ పెయిన్ చాలా ఉంది.. అయినా కూడా సినిమా ప్రమోషన్స్ ను బెటర్ గా చేయాలని వస్తున్నా.మాకు అందరి ఆశీస్సులు ఉన్నాయి. లైగర్ భారీగా ఉండబోతోంది. లైగర్ని ఎవరు ఆపగలరో నేను చూస్తాను. నాకు మా అమ్మ దీవెనలు మరియు ప్రేక్షకుల మద్దతు ఉంది అని తెలిపాడు. చూద్దాం మరి ఈ ఎఫెక్ట్ లైగర్ సినిమాపై ఎంతవరకూ పనిచేస్తుందో..
కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఆగష్ట్ 25న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: