డల్లాస్లో సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సెప్టెం బర్ 24న జరగనుంది. ఆ కార్నివాల్ కు సంబంధించి జెర్సీ, ట్రోఫీని చిరంజీవి పార్క్ హయాత్ హోటల్లో ఆవిష్కరించారు. ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా యువ హీరోలంతా చిరంజీవితో కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, తమన్, తరుణ్, ఆదర్శ్, ప్రిన్స్, ఖయ్యుమ్ తదితరులు పాల్గొన్నారు.చిత్రపురి కాలనీలో సినీ వర్కర్స్, డైలీ వేజ్ కార్మికుల కోసం హాస్పిటల్ కట్టిస్తున్నట్లు చిరు ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసందర్భంగా మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ ..మనకు ఎంతో ఇచ్చిన ప్రేక్షకులకు తిరిగి ఏమి ఇస్తున్నాం అని ఎదురైన ప్రశ్న నుంచి వచ్చిన ఆలోచనే బ్లడ్ బ్యాంక్.అనీ , ఉన్నత విద్యనే అభ్యసించకపోయినా ఈరోజు మేమంతా రూ.లక్షల్లో సంపాదిస్తున్నామంటే చిత్ర పరిశ్రమ ద్వారా ప్రేక్షకులు ఆ అవకాశం ఇచ్చారనీ , అలాంటి వారికి తిరిగి ఎంతో కొంత ఇవ్వాల్సిన అవసరం, బాధ్యత ఉందనీ , అవి ఇచ్చి తీరాల్సిందే అనీ , సినీ కార్మికులకై చిత్రపురి కాలనీలో ఆస్పత్రి నిర్మించనున్నాననీ చెప్పారు.చిరంజీవి నిర్ణయానికి సంగీత దర్శకుడు థమన్ ఎస్ స్పందించి ఒక మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసి , ఆ అమౌంట్ ను ఆస్పత్రికి డొనేషన్ చేయనున్నట్టు చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: