పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక దీనితో పాటు సలార్ సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ మధ్యలో కరోనా వల్ల ఈసినిమా షూట్ కు బ్రేక్ పడింది. ఇక మొత్తానికి మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టి కంప్లీట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి ఎంతో కాలం అయిపోయింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే ఈసినిమా నుండి టీజర్ వస్తుందన్న వార్తలు కూడా వచ్చాయి కానీ అవి వార్తలుగానే మిగిలిపోయాయి. అయితే ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరిదశకు చేరుకోవడంతో ఈ సినిమా నుండి వరుస అప్డేట్లు రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు రెండు రోజుల్లో ఈసినిమా నుండి అప్ డేట్ ఇవ్వనున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తుంది. ఇక ఈ అప్ డేట్ ఖచ్చితంగా టీజర్ గురించే అంటున్నారు. చూద్దాం మరి ఏం అప్ డేట్ఇస్తారో..
కాగా ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక కన్నడ స్టార్ మధు గురుస్వామి ప్రభాస్ కు విలన్గా చేస్తున్నాడు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు ఈసినిమాకు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: