టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నుండి సినిమా వచ్చి దాదాపు మూడేళ్లు అయిపోయింది. కరోనా వల్ల ఆలస్యమైందనుకుంటే ఆ తరువాత కూడా తన నుండి ఇప్పటివరకూ సినిమా రాలేదు. ఇక ఈ మూడేళ్ళ గ్యాప్ను పూర్తి చేసేందుకు నిఖిల్ వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. అందులో చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న కార్తికేయ 2 ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ’కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్గా వస్తుండంతో ఈసినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు ఈసినిమా నుండి వచ్చిన అప్ డేట్స్ కూడా సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ఇప్పటికే ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసేశారు. ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో డిఫరెంట్ నేపథ్యంలో ఉన్న ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈసీక్వెల్ కూడా హిట్ అందుకుంటుందనే నమ్మకంతోనే ఉన్నారు. ఇక తాజాగా ఇప్పుడు ఈసినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మాస్ మహారాజా రవితేజ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశాడు. ఈ ట్రైలర్ కూడా సినిమాపై మరోసారి భారీ అంచనాలను పెంచేసింది.
This one is so gripping!
Looks like another top class film👍🏻https://t.co/2M70EKEHViMy Best Wishes to the entire team of #Karthikeya2 🙂 Looking forward. #KrishnaIsTruth@actor_Nikhil @anupamahere @AnupamPKher @chandoomondeti @vishwaprasadtg @AbhishekOfficl @peoplemediafcy
— Ravi Teja (@RaviTeja_offl) August 6, 2022
కాగా మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో నిఖిల్కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుండగా శ్రీనివాస్ రెడ్డి, ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఆగష్ట్ 13న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: