ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా కూడా ఒకటి. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కిస్తుండటంతో ఇప్పటినుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అయితే శరవేగంగా ఈసినిమా షూటింగ్ జరుగుతుంది. ఈసినిమాను పాన్ ఇండియా రేంజ్ లో కాదు పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్టు సినిమాను ప్రకటించినప్పుడే తెలిపారు. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా గురించి మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ చేసిన వ్యాఖ్యలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హనురాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న సినిమా సీతారామం.ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే కదా. ఈకార్యక్రమానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గెస్ట్ గా వచ్చిన సంగతి కూడా విదితమే. ప్రస్తుతం ప్రభాస్ వైజయంతీ బ్యానర్ లో ప్రాజెక్ట్ కే సినిమా చేస్తున్నాడు. దీంతో మేకర్స్ ప్రభాస్ ను అతిథిగా తీసుకొచ్చారు. ఇక ఈ ఈవెంట్ లో పాల్గొన్న దుల్కర్ మాట్లాడుతూ ప్రాజెక్ట్ కే గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనకి ప్రాజెక్ట్ కే గ్లింప్స్ చూసే అదృష్టం దక్కింది అని అది చూసాక ఒకటే చెప్పగలను ఈ చిత్రం ఇండియన్ సినిమాని మరో లెవెల్లోకి మార్చేస్తుందని తెలిపాడు. దీంతో దుల్కర్ స్టేట్ మెంట్స్ ఈసినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
కాగా ఈసినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈసినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: