సినీ సెలబ్రిటీలకు రూమర్స్ కొత్తేమీ కాదు. సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఒక్కసారి స్టార్ స్టేటస్ అందుకున్న తరువాత రూమర్లు కూడా వెంటనే తిరుగుతూ ఉంటాయి. కొంతమంది సెలబ్రిటీలు వాటిని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళిపోతుంటారు. మరికొంతమంది మొదట కాస్త బాధపడినా ఆతరువాత అలవాటైపోతుంది.. పట్టించుకోవడం మానేస్తారు. ఇక స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా కూడా రూమర్స్ ను పట్టించుకోనని చెబుతుంది. ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక వరుస హిట్లను అందుకొని స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది. ఇప్పుడు తెలుగులో మాత్రమే కాదు తమిళ్, హిందీ, కన్నడ ఇలా పలు భాషల్లో సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ గా తన కెరీర్ లో దూసుపోతుంది. స్టార్ హీరోయిన్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా రష్మిక పై కూడా ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లలో ఎక్కువగా రూమర్స్ వచ్చేది మాత్రం రష్మికపైనే అని చెప్పొచ్చు. ఇక తాజాగా వీటిపై స్పందించిన రష్మిక పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న సినిమా సీతారామం. ఈసినిమాలో రష్మిక మందన్నా కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఇక ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మికను మీ మీద వచ్చే రూమర్స్ పై ఎలా స్పందిస్తారు అని అడుగగా.. సినిమాలు నాకు చాలా ఇచ్చాయి.. సెలబ్రిటీ హోదా, ఫ్యాన్స్, ఫేమ్ ఇలా చాలా వచ్చాయి. ఇవన్నీ దక్కాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. నాకంటే బాగా నటించే వాళ్లు ఉన్నారు.. నాకంటే అందంగా ఉండే వాళ్లు ఉన్నారు. అయినా కూడా నాకు అవకాశాలు వస్తున్నాయంటే అదృష్టమే కదా.. నేను ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికే వచ్చాను.. అందుకే నేను రూమర్స్ ను పట్టించుకోను.. వాటి గురించి ఆలోచించను అంటూ చెప్పుకొచ్చింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: