గత రెండేళ్ల కాలం నుండి సినీ పరిశ్రమకు పలు సమస్యలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే కదా. కరోనా వల్ల రెండేళ్లుగా కోలుకోలేకపోయింది ఇండస్ట్రీ. కరోనా ప్రభావం తగ్గిపోయినా కూడా.. కరోనా వల్ల జనాలు థియేటర్లకు రావడమే పెద్ద సమస్యగా మారింది. సినీ లవర్స్, ఫ్యాన్స్ అయితే ఏదో ఒక రకంగా థియేటర్లకు వస్తారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడం కష్టం. ఇక దీనికి తోడు ఈమధ్య టికెట్ రేట్లపై కూడా గందరగోళం తలెత్తడం ఓ సమస్యగా మారింది. పెద్ద పెద్ద సినిమాలు ఏమో టికెట్ రేట్లను పెంచుకుంటున్నాయి. మీడియం బడ్జెట్ సినిమాల మేకర్స్ కొంత మంది పెంచుకుంటున్నారు.. కొంతమంది మాత్రం ఉన్న రేటుకే అమ్ముతున్నారు. ఈనేపథ్యంలో ఈ ఇష్యూపై పలు కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందుకే ఈ సమస్య నుంచి బయట పడేందుకు నిర్మాతలందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ విషయంపై మాట్లాడుతూ.. స్టార్ హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ ధరలను ఖరారు చేసినట్టు తెలిపారు. హైదరాబాద్, విశాఖపట్నంలలో సింగిల్ స్క్రీన్ లలో జీఎస్టీతో కలిపి రూ. 150, మల్టీప్లెక్స్ లలో జీఎస్టీతో కలిపి రూ. 200గా నిర్ణయించామని చెప్పారు. నిర్మాతలందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మరి దీంతో కొంతవరకూ అయితే సమస్య తీరినట్టే. అయితే చిన్న సినిమాల మేకర్స్ దీనిపై ఎలా స్పందిస్తారు అనేది చూడాలి
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: