సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు.ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ కు అభిమానులుగా మారుతున్న విషయం తెలిసిందే.సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూత లూగిస్తున్నాయి. “పుష్ప ” ఆల్బమ్ కొత్త రికార్డును సృష్టించింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న “పుష్ప :ది రూల్ “మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్లో నిర్వహించే ఇండియా డే పరేడ్కి గ్రాండ్ మార్షల్ గాఅల్లు అర్జున్ వ్యవహరించనున్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 21న ఇండియా డే పరేడ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్’ అధ్యక్షుడు కెన్నీ దేశాయ్ తెలిపారు. ఇందులో అల్లు అర్జున్తో పాటు న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ సహా పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారని చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: