విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు అడివి శేష్. క్షణం, గూఢచారి, ఎవరు ఇలా వరుస హిట్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన మేజర్ సినిమాతో అడివి శేష్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం చెందిన ఉన్ని కృష్ణన్ ఈసినిమా ద్వారా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు. కేవలం హీరోగా మాత్రమే కాదు రచయిత గా కూడా అడివి శేష్ తన సత్తాను చాటుతున్నాడు. తన సినిమాలకు తనే సొంతంగా కథ రాసుకోవడం కూడా గొప్ప విషయం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం అడివి శేష్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం హిట్ సీక్వెల్ హిట్ 2 సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక దీనితో పాటు గూఢచారి సీక్వెల్ కూడా చేయనున్న సంగతి తెలిసిందే కదా. నిజానికి ఈసీక్వెల్ ను ఎప్పుడు అనుకున్నారు కానీ ఇంతవరకూ మొదలుపెట్టలేదు. అయితే దీనికి కారణం కూడా తనే అని ఇటీవలే అడివి శేష్ కూడా క్లారిటీ ఇచ్చాడు. తను వేరే సినిమాలతో బిజీగా ఉండటంవల్ల ఈసినిమా ఆలస్యమవుతూ వస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక త్వరలోనే ఈసినిమాను కూడా ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. అయితే మేజర్ సక్సెస్ తరువాత ఈసినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలో సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
కాగా అడివి శేష్ ,శోభిత దూళిపాళ్ల హీరోహీరోయిన్లుగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో వచ్చిన గూఢచారి సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే. 2018లో విడుదలైన ఈ తెలుగు స్పై థ్రిల్లర్ అందరికీ నచ్చింది. మరి ఈసీక్వెల్ ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: