సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ సెకండ్ పార్ట్ “పుష్ప :ది రూల్ ” మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ లో ప్రారంభం కానుందనీ , భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందనీ , లొకేషన్స్ ని కూడా ఫైనల్ చేశారనీ , ఫస్ట్ పార్ట్ కి అదిరిపోయే ట్యూన్స్ అందించిన దేవి శ్రీప్రసాద్ పార్ట్ 2 కోసం కూడా ట్యూన్స్ ని సిద్ధం చేసేశారనీ , షూటింగ్ ప్రారంభానికి ముందే భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ మూవీకి బాలీవుడ్ కు చెందిన పలు క్రేజీ సంస్థలు భారీ ఆఫర్లు ఇస్తున్నా, మైత్రీ వారు మాత్రం షేర్ విధానంలోనే ఈ మూవీని బాలీవుడ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: