మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతోత్సవాలు భీమవరంలో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ, వైసీపీ నాయకులతోపాటు చిరంజీవి అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రమంత్రిగా రోజా సెల్వమణి కూడా మోదీతో వేదిక పంచుకున్నారు. ప్రధానితో కలిసి సెల్ఫీ తీసుకున్నారు. ఇదే వేదికపై చాలారోజుల తర్వాత కలిసిన హీరో చిరంజీవితో కూడా రోజా సెల్ఫీ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగా స్టార్ చిరంజీవి తో “ముఠామేస్త్రీ”, ‘”ముగ్గురు మొనగాళ్లు”, “బిగ్బాస్”మూవీస్ లో రోజా స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అవకాశం ఇచ్చినా చిరంజీవితో కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నా అని రోజా ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. చాలా రోజుల తరువాత మెగా స్టార్ చిరంజీవి తో మంత్రి రోజా సెల్ఫీ ఇద్దరి అభిమానులనూ ఆకట్టుకుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: