ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా క్రీస్తుపూర్వం 500 వ శతాబ్ద సమయంలో మగధదేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో కళ్యాణ్ రామ్ రెండు విభిన్నమైన పాత్రలలో నటించిన , హై టెక్నికల్ వాల్యూస్, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “బింబిసార”మూవీ థియేట్రికల్ ట్రైలర్ జులై 4వ తేదీ రిలీజ్అయిన విషయం తెలిసిందే. పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన విజువల్స్ తో గ్రాండియర్ గా రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.ట్రైలర్ లాంఛింగ్ ఈవెంట్ లో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ .. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ స్థాపించినపుడు తీసిన “అతనొక్కడే” చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి , “పటాస్” అనిల్ రావిపూడి, “118”గుహన్..ఇలా తన కెరీర్లో ఎక్కువగా కొత్త దర్శకులతోనే సినిమాలు చేశాననీ , “బింబిసార”మూవీతో మల్లిడి వశిష్ట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారనీ , ఈ సినిమాను ఫ్రాంచైజీగా తీయాలనుకుంటున్నామనీ , పార్టు 2 ఇప్పటికే ప్లాన్ చేస్తున్నామనీ , దీనికి పార్టు 3, పార్టు 4 కూడా ఉంటుందనీ చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: