ఈమధ్య కాలంలో ఎంతో మంది సినీ సెలబ్రిటీల ఇంట విషాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. చిన్నవారి నుండి పెద్ద వారు వరకూ చాలా మంది సినీ సెలబ్రిటీలు మరణించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు మరో విషాద ఘటన చోటుచేసుకుంది. మరో నటి తన భర్తను కోల్పోయింది. ఆ నటి ఎవరో కాదు మీనా. మీనా భర్త విద్యాసాగర్ గతరాత్రి కన్నుమూశారు. చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొన్నేళ్ల నుండి విద్యాసాగర్ ఊపిరితిత్తులకు సంబందించిన వ్యాధితో బాధపడుతున్నారట. దీనికి తోడు కరోనా టైమ్ లో మీనా కుటుంబం కరోనా బారిన కూడా పడ్డారు. ఆ టైమ్ లోనే విద్యాసాగర్ కు కోలుకోవడం చాలా కష్టమైంది. అయితే చిన్నగా అందరూ కరోనా నుండి కోలుకున్నారు. ఆ తరువాత పోస్ట్ కోవిడ్ వల్ల వచ్చే సమస్యలతో గత కొద్ది రోజులుగా మళ్లీ అస్వస్థకు గురవుతూనే ఉన్నారు. ఈనేపథ్యంలో తాాజాగా మళ్లీ పరిస్థితి క్షీణించడంతో ఆస్పత్రికి తరలించగా మృతి చెందారు. ఇక మీనా భర్త మృతి పట్ల సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ తన కుటుంబానికి సంతాపం తెలియచేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మీనా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందే బాలనటిగా ఎన్నో సినిమాల్లో చేసింది. ఆ తరువాత నవయుగం సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది. తర్వాత సీతారామయ్యగారి మనవరాలు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మీనా.. అగ్రహీరోలు చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ తో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. 2009లో విద్యాసాగర్ ని వివాహం చేసుకున్నారు. వారికి నైనిక అనే కూతురు కూడా ఉంది. తను కూడా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చేసింది. విజయ్ సూపర్ హిట్ మూవీ అయిన తేరి సినిమాలో నైనిక విజయ్ కూతురి పాత్రలో నటించింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: