బ్లాక్ బస్టర్ “శ్రీమంతుడు “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ “జనతా గ్యారేజ్ “, “రంగస్థలం “, సహా నిర్మాణ సంస్థగా వ్యవహరించిన “ఉప్పెన “, “పుష్ప :ది రైజ్ “, “సర్కారు వారి పాట “వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రస్తుతం చిరంజీవి “MEGA 154 “, బాలకృష్ణ “NBK107 “, విజయ్ దేవరకొండ “ఖుషి”, లావణ్య త్రిపాఠి “హ్యాపీ బర్త్ డే “, సుధీర్ బాబు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ” మూవీస్ సెట్స్ పైన ఉన్నాయి.అల్లు అర్జున్ “పుష్ప :ది రూల్ “మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థగా రాణిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ మాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తుంది. మాలీవుడ్ యంగ్ హీరో”మిన్నల్ మురళి” మూవీఫేమ్ టోవినో థామస్ నటిస్తూ తన సొంత నిర్మాణ సంస్థ టోవినో థామస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై.. డాక్టర్ బిజు దర్శకత్వంలో నిర్మిస్తున్న “అదృశ్య జాలకంగల్”మలయాళ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్.. నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ సినిమాకి రెండు సార్లు గ్రామీ అవార్డును అందుకున్న రిక్కీ కెజ్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా సక్సెస్ కావాలనికోరుకుందాం .




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.