మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య ”(వర్కింగ్ టైటిల్ ) మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.”వాల్తేరు వీరయ్య “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది . “వాల్తేరు వీరయ్య “మూవీ లో మెగా స్టార్ చిరంజీవి మత్స్య కారుడిగా , మత్స్య కారులకు నాయకుడిగా ఒక మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.చాలా రోజుల తరువాత మెగాస్టార్ చిరంజీవి పక్కా మాస్ లుక్లో నటిస్తున్న”MEGA 154″మూవీ సెట్స్ ను దర్శకుడు సుకుమార్ సందర్శించారు. దర్శకుడు బాబీ చిత్రీకరించిన కొన్ని రషెస్ సుకుమార్ కి చూపించడంతో , సుకుమార్ చాలా అనుభూతిని పొందారనీ , మెగా 154 రషెస్ చూశాక సుకుమార్ ఫీలింగ్ తాను ఎప్పటికీ మర్చిపోలేనని దర్శకుడు బాబీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ మూవీ తో పాటు “గాడ్ ఫాదర్ “, “భోళా శంకర్ ” మూవీస్ లో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విషయం తెలిసిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: