పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా సర్కారు వారి పాట. ఈసినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాస్త లేట్ గా రిలీజ్ అయినా కూడా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ అందించింది. ఇక ఇదిలా ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలో సందడి చేయడానికి వచ్చేస్తుంది. తాాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిజానికి అమెజాన్ ప్రైమ్ లో ఈసినిమా ఇప్పటికే అందుబాటులో ఉంది. అయితే అప్పుడు సబ్స్క్రైబర్స్కు ఫ్రీగా చూసే అవకాశం కల్పించలేదు. ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉన్నాసరే… 199 రూపాయలు కడితేనే చూసే అవకాశం కల్పించింది. ఇప్పుడు జూన్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్ ఉన్నవారు ఫ్రీగా చూసే అవకాశం కల్పించారు. మరి మరోసారి ఓటీటీలో ఈసినిమాను చూసి ఎంజాయ్ చేసేయండి.
కాగా మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. ఇంకా ఈసినిమాలో నదియా, నాగబాబు, సముద్రఖని, బ్రహ్మాజీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. థమన్ సంగీతం.. మధి సినిమాటోగ్రఫి అందించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: