సినిమా సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఫ్యామిలితో ట్రిప్ కు వెళ్లడం అందరికీ తెలిసిందే కదా. ఇది మహేష్ కు ఎప్పటి నుండో ఉన్న అలవాటే. సినిమా పూర్తయిందంటే చాలు కొంత సమయాన్ని ఫ్యామిలీకి కేటాయిస్తాడు. సరదాగా ఫ్యామిలితో విదేశాలకు ట్రిప్ వేసేస్తాడు. ఇక ఇప్పుడు పరుశురాం దర్శకత్వంలో మహేష్ హీరోగా వచ్చిన సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అయి మంచి బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇక ఆసినిమా హిట్ అవ్వడంతో కుటుంబంతో కలిసి సెలవులను ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అప్పుడప్పుడు ట్రిప్ కు సంబంధించి ఫొటోలను తన సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం మహేష్ కు అలవాటే. తాజాాగా ఒక ఫొటో షేర్ చేయగా అది ఇప్పుడు వైరల్ అవుతుంది. నమ్రతా శిరోద్కర్, గౌతమ్ మరియు సితారతో కలిసి సెల్ఫీని పోస్ట్ చేశాడు మహేష్. ఇక ఆ పోస్ట్ లో రోడ్ ట్రిప్ ఇట్స్, నెక్స్ట్ స్టాప్ ఇటలీ, లంచ్ విత్ ది క్రేజీస్ అంటూ పేర్కొన్నాడు. ఇక ఈ ఫొటోలో మహేష్ స్టైలీష్ గా ఉండటంతో ఇప్పుడు ఆ పిక్ వైరల్ అవుతుంది.
View this post on Instagram
కాగా మహేష్ తన తరువాత సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈసినిమా షూటింగ్ ను కూడా స్టార్ట్ చేయనున్నాడు మహేష్. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈసినిమాపై ఇప్పటినుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమాలో మహేష్ బాబు సరసన మరోసారి పూజా హెగ్డే నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు మధి కెమెరామెన్గా వ్యవహరించబోతోన్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: