ఎన్న బయోపిక్ లు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ కొంతమంది బయోపిక్ లు మాత్రమే ప్రేక్షకుల గుండెలను తాకుతాయి. అలాంటి బయోపిక్కే రీసెంట్ గా వచ్చిన మేజర్. అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమాకు శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారుముంబై తాజ్ హోటల్ ఘటన గురించి అందరికీ తెలుసు.. ఆ ఘటనలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో తెలుసు.. కానీ చావుకు ఎదురెళ్లి మరీ వీర మరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ లాంటి సైనికుడి జీవితం గురించి చాలా తక్కువ మందికి తెలుసుంటుంది. ముంబై తాజ్ ఘటనలో చావును సైతం లెక్కచేయకుండా ఎంతో మంది ప్రాణాలు కాపాడిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈసినిమా తెరకెక్కించారు. ఇక ఈసినిమా రెగ్యులర్ గా వచ్చే సినిమా కాదు కాబట్టి.. నార్త్ సౌత్ అన్న తేడా లేకుండా అందరూ కనెక్ట్ అవుతున్నారు. అంతేకాదు సందీప్ చేసిన త్యాగానికి ఇలాంటి బయోపిక్ అందించినందుకు దేశ మొత్తం శాల్యూట్ చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కేవలం ఇక్కడ మాత్రమే కాదు విదేశాల్లో కూడా ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈసినిమా కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. తాజాగా న్యూయార్క్ లో కూడా ఈసినిమాకు మరో ఘనత దక్కింది. న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్లో ప్రజలు గుమిగూడి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో సెలబ్రేషన్స్ తో మేజర్ కు గౌరవప్రదమైన నివాళులు తెలిపారు. అంతేకాదు అంతర్జాతీయ మార్కెట్లు కూడా ఈసినిమాను స్వాగతిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే ఈసినిమా స్క్రీన్లను కూడా రాబోయే రోజుల్లో పెంచనున్నట్టు తెలుస్తుంది.
View this post on Instagram
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: