రీఎంట్రీ తర్వాత చిరు కూడా స్పీడు పెంచిన సంగతి తెలిసిందే కదా. మధ్యలో కరోనా కనుక రాకపోయి ఉంటే ఈ రెండేళ్ల గ్యాప్ లో రెండు మూడు సినిమాలు రిలీజ్ చేసేసి ఉండేవాడు. కానీ కరోనా వల్ల సినిమాలు పెండింగ్ లో పడిపోయాయి. అందులో భాగంగానే ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్న ఆచార్య సినిమా రీసెంట్ గానే రిలీజ్ అయింది. ఇక ఈ మధ్యలో చిరు తన కొత్త సినిమాలను కూడా మొదలు పెట్టాడు. మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్నగాడ్ ఫాదర్ ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేసుకోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్, బాబి దర్శకత్వంలో వస్తున్న సినిమాలు షూటింగ్ లు మొదలుపెట్టి కొంతవరకూ షూటింగ్ ను కూడా జరుపుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం అయితే గాడ్ ఫాదర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అయితే
ఆచార్య సినిమా వలన ఈసినిమా పనులకు చిరు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఇక ఆచార్య సినిమా రిలీజ్ అవ్వడం.. ఆతరువాత చిరు వెకేషన్ కు వెళ్లడం జరిగింది. రీసెంట్గా ఆయన వెకేషన్ ముగించుకుని హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఇక రావడమే ఆలస్యం అన్నట్లుగా ఆయన తన నెక్ట్స్ ప్రాజెక్టు పనులను మొదలుపెట్టారు. తాజాగా ఈసినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనుల్లో భాగంగా చిరు తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ను మొదలుపెట్టినట్టు తెలుస్తుంది.
ఇక ఈ సినిమా పూర్తిగా పొలిటిక్ థ్రిల్లర్గా వస్తున్న ఈసినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ అండ్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తోండగా, సత్యదేవ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఒక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: