‘మత్తు వదలరా’ చిత్రంతో హీరోగా పరిచయమైన శ్రీసింహా మొదటిసినిమాతోనే ఆకట్టుకున్నాడు. ఆతరువాత ‘తెల్లవారితే గురువారం’ సినిమా చేశాడు కానీ అది అనుకున్నంత సక్సెస్ ను అయితే ఇవ్వలేకపోయింది. ఇక ఇప్పుడు ఆ సినిమా తర్వాత వరుసగా పలు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ‘భాగ్ సాలే’, ‘దొంగలున్నారు జాగ్రత్త’ సినిమాలు ఉన్నాయి. ఇందులో దొంగలున్నారు జాగ్రత్త ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టింది. అయితే ఈసినిమాకు కూడా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక మళ్లీ ఇటీవలే షూటింగ్ ను మొదలుపెట్టారు. ఇన్ని రోజులు శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్న ఈసినిమా తాజాగా షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా త్వరగా పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా సతీష్ త్రిపుర ఈ మూవీతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ప్రీతి ఆస్రాని హీరోయిన్గా నటిస్తున్న ఈసినిమాలో సముద్రఖని కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ‘‘దొంగలున్నారు జాగ్రత్త’’ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రోహిత్ కులకర్ణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. యశ్వంత్ సి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. మరి ఈసారి దొంగగా మారిన శ్రీ సింహా ఎంతవరకూ ఆకట్టుకుంటాడో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: