సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ మూవీ లో సాంగ్స్ , ఫైట్స్ ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నాయి. మహేష్ బాబు , కీర్తి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న “సర్కారు వారి పాట” మూవీ తాజాగా 200కోట్ల క్లబ్ లో చేరింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“సర్కారు వారి పాట” మూవీ లో హీరో మహేష్ బాబు, విలన్ సముద్రఖనికి వార్నింగ్ ఇవ్వడానికి బయలుదేరే సన్నివేశంతో పాటు మరో రెండు మూడు సన్నివేశాల్లో జావా మెరూన్ బైక్ డ్రైవ్ చేసిన విషయం తెలిసిందే. మహీంద్రా గ్రూప్కు చెందిన క్లాసిక్ లెజెండ్స్ కంపెనీ జావా బైక్స్ను తయారు చేస్తోంది. “సర్కారు వారి పాట”లో జావా బైక్ మీద మహేష్ బాబు ఉన్న విజువల్స్ను క్లాసిక్ లెజెండ్స్ కో-ఫౌండర్ అనుపమ్ ట్వీట్ చేయగా , మహేష్ బాబు, జావా కాంబినేషన్ చూడటం తాను ఎలా మిస్ అయ్యాను? ప్రస్తుతం న్యూయార్క్ లో ఉన్నాననీ , న్యూజెర్సీలో “సర్కారు వారి పాట” మూవీ చూస్తాననీ ఆనంద్ మహీంద్రా రీ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ పట్ల సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: