సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ మూవీ లో సాంగ్స్ , ఫైట్స్ ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నాయి. మహేష్ బాబు , కీర్తి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ మూవీ 200కోట్ల క్లబ్ కు చేరువలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫస్ట్ టైమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో స్క్రీన్ షేర్ చేసుకున్న కీర్తి సురేష్ మాట్లాడుతూ .. మహేష్ బాబు తో జీవితంలో అస్సలు మరిచిపోలేని రెండు అనుభూతులు తనకు ఉన్నాయనీ , మహేష్ ను చెంప దెబ్బ కొట్టే సీన్ ఒకటి కాగా , మ..మ..మహేషా మాస్ సాంగ్ లో తాను చాలా ఇబ్బందిపడ్డాననీ , ఆ సిగ్నేచర్ స్టెప్పులో తనకు కోఆర్డినేషన్ రాలేదనీ , 2-3 సార్లు మహేష్ ముఖంపై కొట్టాననీ , చాలా బ్యాడ్ అనిపించిందనీ ,. తానేమైనా తప్పు చేశానా అని మహేష్ సరదాగా అడిగారనీ , ఇక మరో సాంగ్ లో కూడా ఓ స్టెప్పు ఉందనీ , ఆ మూమెంట్ తనకు రాలేదనీ , తాను తన స్టయిల్ లో ఇంకేదో చేశాననీ , అదే మహేష్ కు నచ్చిందనీ , తను కూడా అలానే చేశారనీ , ఈ రెండు అనుభవాల్ని తాను మరిచిపోలేననీ చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: