మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , సమంత జంటగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ఖుషి ″మూవీ ఫస్ట్ షెడ్యూల్ కశ్మీర్ లో జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ షెడ్యూల్ లో విజయ్ , సమంత పాల్గొన్నారు. ఈ మూవీ లో సచిన్ ఖేద్కర్ , మురళీశర్మ , లక్ష్మి ,అలీ , రోహిణి , వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హేషం అబ్దుల్ వాహెబ్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కశ్మీర్ లో విజయ్ దేవరకొండ , సమంత లపై దర్శకుడు శివ నిర్వాణ పలు అందమైన లొకేషన్స్ లో కీలక సన్నివేశాలు తెరకెక్కించారని సమాచారం. తాజాగా”ఖుషి” మూవీ కశ్మీర్ షెడ్యూల్ పూర్తయినట్టు మేకర్స్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రెండో షెడ్యూల్ అతి త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. బ్లాక్ బస్టర్ “మహానటి”మూవీ తరువాత విజయ్, సామ్ మరోసారి జోడీ కట్టడంతో “ఖుషి ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: