లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వస్తా అన్నట్టు రెండేళ్ల తరువాత వచ్చినా కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత దాదాపు రెండున్నరేళ్లకు సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. దానికితగ్గట్టే మరోవైపు కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. ఇప్పటికే ఈసినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను జరుపుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు కర్నూల్ లో కూడా ఈమధ్య సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీమ్ వైజాగ్ లో సక్సెస్ మీట్ ను కూడా నిర్వహించింది. ఈ సందర్భంగా మహేష్ బాబు, పరుశురాం, కీర్తి సురేష్ అభిమానులతో ముచ్చటించారు. ఈమీట్ లో ఫ్యాన్స్ మహేష్ ను పలు ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడిగారు. ఇక మహేష్ స్పాంటేనియస్ గురించి అలానే ఎలా ఆన్సర్స్ ఇస్తాడో తెలిసిందే కదా. ఇప్పుడు కూడా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు కామెడీగా ఆన్సర్స్ చేసి నవ్వించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసందర్భంగా ఒక అభిమాని ఒక సీన్లో ‘కీర్తి సురేశ్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు మీరు చాలా ఎగ్జైట్ అవుతారు కదా? రియల్ లైఫ్ లో ఎప్పుడైనా అలా చేశారా? అని అడిగితే మా ఆవిడకి నాకు గొడవపెట్టాలని ఫిక్స్ అయ్యారా ఏంటి? అంటూ.. అవతల కీర్తి సురేష్ లేకుండానే తాను ఆ సీన్ చేసినట్టు చెప్పారు. ఇంకా ఈ సినిమాలో ఒక సీన్లో నన్ను కీర్తి తిట్టాలి .. నా ముఖం చూస్తూ తిట్టాలని పరశురామ్ చెప్పాడు. ‘మీ ముఖం చూస్తూ తిట్టడం నా వల్ల కాదు సార్ అని కీర్తి నాతో అంది. మీ ఫ్యాన్స్ ఊరుకోరు నేను చేయను సార్ అంది. వాళ్లు ఏమీ అనరమ్మా .. నిజంగా ఆ సీన్ చేసేటప్పుడు తనకి చాలా భయం వేసిందని అన్నారు. ఇప్పటికీ ఆ సీన్ గురించి మాట్లాడుతుంటే తనకి భయం వేస్తోందని చెప్పుకొచ్చింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: