ఈమధ్య టికెట్ రేట్ల పెంపుపై పెద్ద ఎత్తునే చర్చలు జరుగిన సంగతి తెలిసిందే కదా. పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను అనుమతులు కోరితే అవి గ్రీన్ సిగ్నల్ ఇస్తే టికెట్ రేట్లను పెంచుకోవచ్చు. ఈమధ్య వచ్చిన పెద్ద సినిమాలు అన్నీ టికెట్ రేట్లను పెంచుకున్నాయి. అయితే తమ సినిమాకు అలాంటి పరిస్థితి ఉండదని నిర్మాత దిల్రాజు తెలుపుతున్నారు. తమ సినిమా టికెట్ రేట్ల పెంపుపై వివరణ ఇస్తూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ప్రేక్షకులందరూ థియేటర్లకు వచ్చి తమ సినిమాను ఎంజారు చేయాలన్న ఉద్దేశంతో సాధారణ టికెట్ రేట్లతోనే ‘ఎఫ్3’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సాధారణ టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘ మే 27న, #F3Movie మీ అభిమాన థియేటర్లలో.. సాధారణ టికెట్ రేట్లతో ‘🤘🏻🤩
📽️ Let them know Raju Garu 🎟️
▶️ https://t.co/UCS0ElExcl#DilRaju @AnilRavipudi #Sunaina #F3OnMay27 🍿@VenkyMama @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @ThisIsDSP @SVC_official @adityamusic pic.twitter.com/H43dm8a7iB— Sri Venkateswara Creations (@SVC_official) May 18, 2022
కాగా విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. ఎఫ్ 2 సినిమాకు వస్తున్న సీక్వెల్ ఇది. ఈసినిమాలో తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా నటించగా సునీల్, సోనాల్చౌహన్లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పూజా హెగ్టే ఓ స్పెషల్ సాంగ్లో కనిపించనుంది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరీష్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈసినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: