ఈమధ్య హీరోయిన్లు కూడా తమ కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు హీరోయిన్లు దశాబ్దాలు అయినా కూడా సినిమాలు చేసేవాళ్లు.. కానీ ఇప్పుడున్న పోటీ వాతావరణంలో అది అసాధ్యమనే చెప్పొచ్చు. ఐదేళ్లు కంటిన్యూగా హీరోయిన్ కెరీర్ కొనసాగడమే చాలా కష్టమేపోయింది. అందుకే టైమున్నప్పుడే కెరీర్ ను గాడిలో పెట్టుకుంటున్నారు. దీనిలో భాగంగానే ఒక్క ఇండస్ట్రీకే ఫిక్స్ అయిపోకుండా పలు ఇండస్ట్రీల్లో కూడా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే తెలుగులో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న వారు అటు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు జాతిరత్నాలు భామ కూడా కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. జాతి రత్నాలు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా మొదటి సినిమాతోనే చిట్టి పాత్రలో తన నటనతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. జాతిరత్నాలు సినిమా తర్వాత కూడా పలు సినిమాల్లో అవకాశాలు కూడా దక్కాయి. ప్రస్తుతం రవితేజతో రావణాసుర అనే చిత్రంలో నటిస్తుంది. ఇక తాజా సమాచారం ప్రకారం కోలీవుడ్ లో కూడా ఫరియా కు మంచి ఆఫర్ దక్కినట్టు తెలుస్తుంది. తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్న విజయ్ ఆంటోని హీరోగా సుసీంద్రన్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతుంది. ఇక ఈసినిమాలోనే ఫరియా అబ్దుల్లాకు అవకాశం వచ్చినట్టు సమాచారం. ఈ సినిమాలో ఫరియా ఓ పల్లెటూరి అమ్మాయిగా ఛాలెంజింగ్ రోల్లో కనిపించనుందట. మరీ ఇందులో ఎంత నిజముంది అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: