పరుశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈసినిమా మే 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలుసు కదా. ఇప్పటివరకూ ఈసినిమా నుండి ఏ అప్ డేట్ వచ్చినా అది సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక మరోపక్క రిలీజ్ కు ఇంకా ఐదు రోజులు మాత్రమే టైముంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ వీలైనంత ప్రమోషన్స్ ను చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా మహేష్ బాబు తాజాగా తన అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. ప్రియమైన అభిమాన మిత్రులకు ప్రముఖ యువ దర్శకుడు పరుశురామ్ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ 14 రీల్స్ ప్లస్ వంటి ప్రముఖ సంస్థలపై ఎర్నేని నవీన్, యలమంచలి రవి శంకర్, ఆచంట రామ్, ఆచంట గోపీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ పూర్తయి.. అన్ని కార్యక్రమాలు పనులు పూర్తి చేసుకుని మే 12న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది. ఈ సినిమా ఆడియో ‘సరేగమ’ కంపెనీ ద్వారా మార్కెట్లో విడుదలై రేటింగ్ లో విశేష సంచలనం సృష్టిస్తోందని తెలిపారు. ఎన్నో అంచనాలతో, ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న మన ‘సర్కారు వారి పాట’ చిత్రం థియేటర్లలో చూసి మీ స్పందన తెలియజేయగలరు అంటూ పేర్కొన్నారు. అంతేకాదు, మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మించే చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ లో ప్రారంభం అవుతుందని కూడా అప్ డేట్ ఇచ్చారు. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాన్ని ఆశించే మీ శ్రేయోభిలాషి అంటూ మహేష్ తన లేఖలో తెలిపాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: