కియారా అద్వానీ గా పేరు మార్చుకున్న అలియా అద్వానీ కమర్షియల్ హిట్ “ఫగ్లీ “మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించారు. సూపర్ హిట్ “ఎమ్ ఎస్ ధోని :ది అన్ టోల్డ్ స్టోరీ ” మూవీ తో గుర్తింపు పొందారు. బ్లాక్ బస్టర్ “భరత్ అనే నేను “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి కియారా అద్వానీ తన అందం , అభినయం తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కియారా కథానాయికగా నటించిన సూపర్ హిట్ “అర్జున్ రెడ్డి ” మూవీ హిందీ రీమేక్ “కబీర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించడం తో కియారా బాలీవుడ్ లో బిజీగా మారారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ కథానాయికగా తెరకెక్కిన “భూల్ భులయ్యా 2 “, “గోవిందా నామ్ మేరా” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కియారా ప్రస్తుతం “#RC15 “(తెలుగు ), “జుగ్ జుగ్ జియో ”(హిందీ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. కియారా తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే అందరూ కూడా ఓటీటీలో చూసేస్తున్నారనీ , అందువలన రీమేకులు చేయడానికి తాను పెద్దగా ఇష్టపడటం లేదనీ , ఒకవేళ కథలో మార్పులు .. చేర్పులు చేసి ఒక కొత్త కథగా చెప్పాలనుకుంటే మాత్రం చేస్తాననీ , ఇక ఇతర భాషల్లో నటించడానికి తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాననీ , కాకపోతే హిందీలో చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతామనీ , అందువల్ల హిందీ మూవీస్ లో నటించడానికి ఇష్టపడతాననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: