‘సర్కారు వారి పాట’ మరో రికార్డ్.. స్పెషల్ ఎమోజీ సర్ ప్రైజ్..!

Sarkaru Vaari Paata Team Special Surprise for Fans,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Movie Updates,Mahesh Babu Sarkaru Vaari Paata Movie Updates, Sarkaru Vaari Paata Team,Sarkaru Vaari Paata Movie Makers,Sarkaru Vaari Paata Team Plan a Suprise For Fans,Movie Makers of Sarkaru Vaari Paata Plans a Suprise for Fans, Mahesh Babu And Keerthy Suresh Movie Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie Songs,Sarkaru Vaari Paata Trending Songs,Sarkaru Vaari Paata Telugu Movie Review,Sarkaru Vaari Paata Movie Review, Sarkaru Vaari Paata Review

పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ
సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు రిలీజ్ కు ముందే ఈసినిమా పలు రికార్డులు క్రియేట్ చేసుకుంటుంది. ఇప్పటికే పాటలు రూపంలో అలానే టీజర్, ట్రైలర్ ఇలా పలు విషయాల్లో రికార్డులు క్రియేట్ చేసుకుంటుంది ఈసినిమా. ఇక ఇప్పుడు ఈసినిమాకు మరో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ రివీల్ చేశారు చిత్రయూనిట్. ఈమధ్యకాలంలో సినిమాలకు ఎమోజీలు రావడం చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు సర్కారు వారి పాట కు కూడా స్పెషల్ ఎమోజీ వచ్చేసింది. మహేష్ బాబు కు సంబంధించిన స్పెషల్ ఎమోజీని తీసుకొచ్చారు. ఈ ఎమోజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే విశేషం ఏంటంటే.. తెలుగు సినిమాల్లో సర్కారు వారి పాట సినిమాతోనే టాలీవుడ్ లో ఈ ట్రెండ్ స్టార్ట్ అవ్వడం. దీంతో మహేష్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసేశారు. మరో ఆరు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మహేష్ కూడా ఫారిన్ ట్రిప్ ముగించుకొని రావడంతో ఇకనుండి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటారని అర్థమవుతుంది. అంతేకాదు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మే 7న నిర్వహించబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించనున్నారు.

కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, సముద్రఖని కూడా ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా.. ఆర్ మధి సినిమాటోగ్రఫీ, ఏ ఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. మే 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + eight =