సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్ “క్షణం “మూవీ తో అడివి శేష్ హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. “క్షణం “మూవీ కి స్క్రీన్ ప్లే అందించిన అడివి శేష్ బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డ్ అందుకున్నారు. “గూఢచారి “, “ఎవరు ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అడివి శేష్ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ రైటర్ , హీరోగా కొనసాగుతున్నారు. అడివి శేష్ హీరోగా తెలుగు , హిందీ భాషలలో రూపొందిన “మేజర్ “ మూవీ , “HIT 2-సెకండ్ కేస్” మూవీస్ ఒక నెల గ్యాప్ లో రిలీజ్ కానున్నాయి. హీరో అడివి శేష్ ఈ రెండు మూవీస్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A+S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ , సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన”మేజర్ ” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. శోభిత ధూళిపాళ ఒక కీలక పాత్రలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్”HIT :ది ఫస్ట్ కేస్”మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మూవీ సీక్వెల్ శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర కథానాయకుడు అడివి శేష్ హీరోగా తెరకెక్కిన “HIT :ది సెకండ్ కేస్”మూవీ జులై 29 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి కథానాయిక. రావు రమేష్ , పోసాని, భానుచందర్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. జాన్ స్టీవర్ట్ ఎదురి సంగీతం అందించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: