పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు-కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈసినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసేశారు. దీనిలో భాగంగానే ఇప్పటికే విడుదలైన పోస్టర్స్లో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇంకా కళావతి, పెన్నీ, సర్కారు వారి పాట టైటిల్ సాంగ్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ప్రమోషన్స్ లో ఇంకా హీరో హీరోయిన్లు పాల్గొనలేదు కానీ టెక్నికల్ టీమ్ మాత్రం ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ కానీ, ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ కానీ అలానే థమన్ ఇంకా లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ కానీ ఈసినిమాపై ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపించారు. ఈసినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఇంటర్వ్యూల ద్వారా చెప్పారు. దీంతో ఈసినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది ట్రైలర్ కోసం. ట్రైలర్ అప్ డేట్ ఇచ్చిన దగ్గరనుండి అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే నేడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక చెప్పినట్టే ఈ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మహేష్ లుక్స్, కమర్షియల్ ఎలిమెంట్స్, హీరోయిన్ తో వచ్చే సన్నివేశాలు ఇలా అన్నీ ఆకర్షణీయంగా ఉన్నాయి. మొత్తానికి ట్రైలర్ అయితే ఇప్పటికే ఉన్న అంచనాలు మరింత రెట్టింపు చేసింది. మరి ఇంకా పదిరోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. చూద్దాం మహేష్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో.
Our meeting is confirmed in theatres on May 12th!
Here’s the trailer of #SarkaruVaariPaatahttps://t.co/r874NLN0FT@KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @madhie1 @GMBents @MythriOfficial @14ReelsPlus @saregamasouth
— Mahesh Babu (@urstrulyMahesh) May 2, 2022
కాగా ఈసినిమాలో వెన్నెల కిషోర్, సముద్రఖని కూడా ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా.. ఆర్ మధి సినిమాటోగ్రఫీ, ఏ ఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. మే 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: