యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా ఇటీవల రిలీజై డీసెంట్ హిట్ ను కొట్టిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు తన తరువాత సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసే పనిలో పడింది. ఇక దీనితో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా సలార్ కూడా షూటింగ్ దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కే’ సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ కూడా ఇప్పటికే మొదలైపోయింది. అయితే మధ్యలో తన రిలీజ్ సినిమా ప్రమోషన్స్ అలానే మిగిలిన సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉండటం వల్ల ఈసినిమా షూటింగ్ కు బ్రేకులు పడుతూ వస్తున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ సెట్స్ లో జాయిన్ అయ్యారు. ఈసినిమా కోసం వేసిన ప్రత్యేక మైన సెట్స్ లో ప్రభాస్ తో పలు కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.
అత్యంత భారీ బడ్జెట్తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అమితాబచ్చన్ నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్తో రూపొందించనున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: