ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ అయిన శ్రీనిధి శెట్టి అందాల పోటీలలో 2015 సంవత్సరం లో మిస్ కర్ణాటక, 2016 సంవత్సరంలో మిస్ దివా సుప్రనేషనల్ , మిస్ సుప్రనేషనల్ విన్నర్ గా నిలిచారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1″మూవీ తో శాండల్ వుడ్ లో కెరీర్ ప్రారంభించారు. ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని శ్రీనిధి శెట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా తెరకెక్కిన “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న “కోబ్రా “మూవీ తో శ్రీనిధి కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. “కోబ్రా “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా శ్రీనిధి డైరెక్టర్ ప్రశాంత్ నీల్పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మీ సొంత నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చేందుకు.. అవి మీ కలలను సాకారం చేసుకునేందుకు దోహదపడవచ్చుననీ , అయితే చాలా అరుదుగా… కొన్నిసార్లు ఇతరుల నిర్ణయాలు కూడా జీవితాన్ని మార్చేస్తాయనీ ,ప్రశాంత్ నీల్ “కే జి ఎఫ్ ” సినిమాకు తనను హీరోయిన్గా ఎంచుకోవడంతో తన జీవితమే మారిపోయిందనీ , అందుకు ప్రశాంత్ నీల్కు థ్యాంక్స్ అంటూ శ్రీనిధి ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: