పలు సూపర్ హిట్ సినిమాలకు రైటర్ గా పని చేసిన కొరటాల శివ సూపర్ హిట్ “మిర్చి “మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. “శ్రీమంతుడు “, “జనతా గ్యారేజ్ “”భరత్ అనే నేను ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో కొరటాల ప్రేక్షకులను అలరించారు. మెగా స్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన “ఆచార్య “మూవీ 29 వ తేదీ రిలీజ్ కానుంది. కొరటాల దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న “#NTR30” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఆచార్య”మూవీ ప్రమోషన్స్ కై పలు ఇంటర్వ్యూ లలో పాల్గొన్న కొరటాల ఒక ఇంటర్వ్యూ లో తనకు ఇష్టమైన సినిమాల గురించి చెప్పారు. కొరటాల మాట్లాడుతూ .. “సాగరసంగమం”మూవీ అంటే తనకు చాలా ఇష్టం అనీ , కళ పట్ల అంకితభావం , ప్రేమ పట్ల త్యాగం , జీవితానికి గల పరమార్థం .. ఇవన్నీ ఈ సినిమాలో కనిపిస్తాయనీ , చాలా అద్భుతమైన స్క్రిప్ట్ ఇదనీ , అందువల్లనే ఈ రోజుకీ ఈ సినిమాను చూడగలుగుతున్నామనీ , ఆస్వాదించగలుగుతున్నామనీ , ఇది క్లాసికల్ మూవీ అయినప్పటికీ కమర్షియల్ అంశాలు పుష్కలంగా కనిపిస్తాయనీ , అలాగే శంకర్ దర్శకత్వంలో వచ్చిన “భారతీయుడు” సినిమా అంటే కూడా తనకు చాలా ఇష్టమనీ , అవినీతిని సహించలేని కథానాయకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుందనీ , అవినీతికి పాల్పడింది కన్నకొడుకైనా సరే శిక్షను అనుభవించవలసిందే అనే ఒక తండ్రి కథ అనీ , ఇది కూడా చాలా గొప్ప స్క్రిప్ట్ అనీ , స్క్రిప్ట్ విషయంలో ఆ సినిమాల ప్రభావం నాపై ఉంటుందనీ , అందుకే స్క్రిప్ట్ విషయంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీపడననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: