శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా మేజర్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 26/11 దాడుల్లో ఆయన చూపించిన తెగువ, ధైర్య సాహసాలు మాత్రమే కాకుండా ఆయన జీవితంలోని ప్రతీ ఒక్క ఘటనను చూపించబోతోన్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరోవైపు అడివి శేష్ అప్పుడప్పుడు ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ డేట్ కూడా మారింది. మే 27న ఈసినిమాను రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ ఫిక్స్ అయింది. కానీ ఇప్పుడు మళ్లీ రిలీజ్ డేట్ మారుస్తూ కొత్త రిలీజ్ డేట్ ను మార్చింది. జూన్ 3వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.
In Cinemas June 3rd 2022! @AdiviSesh @saieemmanjrekar @SashiTikka @SonyPicsIndia @GMBents @AplusSMovies pic.twitter.com/1evh2fpmnm
— Mahesh Babu (@urstrulyMahesh) April 27, 2022
ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్లతో పాటు సయీ మంజ్రేకర్ కూడా మరో కథానాయికగా నటిస్తుంది. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ హోమ్ బేనర్ జీఎంబీ ప్రొడక్షన్స్ సోనీ పిక్చర్స్తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: