కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య. తండ్రీ కొడుకులిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో.. ఫ్యాన్స్ ఎప్పటినుండి వెయిట్ చేస్తున్న మూమెంట్ కావడంతో ఈసినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా రిలీజ్ కు ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. మరోవైపు చిత్రయూనిట్ వరుసగా ఇంటర్వ్యూలు బిజీగా ప్రమోషన్స్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రమోషన్స్లో భాగంగా చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివను హరీష్ శంకర్ ఇంటర్వ్యూ చేశారు. ఇక ఈసందర్భంగా ఆచార్య సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు చిరు. ఈనేపథ్యంలోనే తనకు కామెడీ సినిమాలు చేయాలని ఉందని.. అది కూడా హరీష్ శంకర్ డైరెక్ట్ చేయాలని చెప్పడంతో హరీష్ శంకర్ సంతోషం వ్యక్తం చేస్తాడు. అంతే కాదు తను పవన్ తో చేయబోతున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమా నుండి ఒక డైలాగ్ ను కూడా లీక్ చేస్తారు చిరంజీవి. పవన్ కళ్యాణ్ అలా నడిచి వస్తుంటారు.. ఆయన వెనక స్టూడెంట్స్ ఉంటారు.. విలన్ ఇలా అంటాడట.. మొన్న మన ఇంటికి వచ్చినప్పుడు వీడి ధైర్యం ఏంటని అనుకున్నా.. కానీ వీడు అడుగు వేస్తే వెనకాల లక్షమంది వస్తారు.. ఇదే వీడి ధైర్యం అని విలన్ అంటాడట. కానీ పక్కన వాడు వెనకాల లక్ష మంది ఉన్నారని ధైర్యం కాదు.. ఆ లక్ష మందికే వీడు ముందు నడుస్తున్నాడనే ధైర్యం అని అంటాడు. ప్రస్తుతం ఈ డైలాగ్ వైరల్ అవుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: