ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లకు మాత్రమే ఫుల్ సక్సెస్ రేటు ఉంటుంది. అందులో రాజమౌళి పేరు ఫస్ట్ ఉంటుంది. ఇక ఆ తరువాత వచ్చిన డైరెక్టర్లలో కొరటాల శివ కూడా ఆ లిస్ట్ లో తన పేరును చేర్చుకున్నాడు. వరుస హిట్లతో తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు కొరటాల శివ. కెరీర్ మొదటి నుండి స్టార్ హీరో లతోనే చేసాడు. మొదటి సినిమా మిర్చి ప్రభాస్ తో, శ్రీమంతుడు, భారత్ అనే నేను మహేష్ తో, జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ తో సినిమాలు వరుసగా హిట్లు అందుకున్నాడు. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో చిరుతో చేసిన ఆచార్య సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 29వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈసినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తరువాత కొరటాల శివ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జనతా గ్యారేజ్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా అవ్వడంతో ఇప్పటినుండే ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక దానికి తోడు ఈసినిమా మరో లెవల్లో ఉంటుంది అంటున్నాడు కొరటాల శివ. నా మొదటి సినిమా మిర్చిలో మాస్ ఎలిమెంట్స్ అలానే కమర్షియల్ హైలెట్స్ చాలా ఉంటాయి.. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో అంతకుమించి మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి అని తెలిపారు. అంతేకాదు ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని చెప్పాడు. మరి ప్రభాస్ కు మిర్చి సినిమా ఎంత క్రేజ్ తెచ్చిందో చూశాం..అలాంటిది ఎన్టీఆర్ 30 లో అంతకుమించి అంటే ఆ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.. ఇక జూన్ నుండి ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: