హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.రవి బస్రూర్ సంగీతం అందించారు. “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ అన్ని భాషలలోను విశేష ప్రేక్షకాదరణ పొందుతుంది.ప్రపంచవ్యాప్తంగా 7 రోజులకు 700 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ కర్ణాటక లో , తెలుగు రాష్ట్రాలలో 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇక బాలీవుడ్ లో 250 కోట్లకు పైగా , ఓవర్సీస్ లో 3 మిలియన్ డాలర్స్ కు పైగా వసూళ్ళతో దూసుకుపోతోంది.“కె జి ఎఫ్ చాప్టర్ 2” మూవీ పై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
“కె జి ఎఫ్ చాప్టర్ 2 ” మూవీ టీమ్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభినందించిన విషయం తెలిసిందే. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. బ్రదర్ ప్రశాంత్ నీల్ మరియు హోంబలే పిక్చర్స్ వారికి మాసివ్ సక్సెస్ అందుకున్నందుకు కంగ్రాట్స్ చెబుతున్నాననీ ,అలాగే నా డియర్ బ్రదర్ యష్ సూపర్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు పెర్ఫామెన్స్ తో అదరగొట్టేసాడనీ , అని అలాగే సంజయ్ దత్, రవీనా టాండన్ మరియు ప్రకాష్ రాజ్, రావు రమేష్ లు తమ బెస్ట్ వర్క్ అందించారనీ , శ్రీనిధి శెట్టి, నటి అర్చన లు ఫెంటాస్టిక్ వర్క్ అందించారనీ , “కె జి ఎఫ్ చాప్టర్ 2 ” మూవీ టీమ్ కు అభినందనలు అంటూ రామ్ చరణ్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: