అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ వంగా. ఇక ఈసినిమా తరువాత హిందీలో కూడా అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేసే ఛాన్స్ ను దక్కించుకున్నాడు. అక్కడ కూడా ఆసినిమా సంచలన విజయం సాధించింది. అంతేకాదు కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టుకుంది. ఆ సినిమా తరువాత అక్కడే బాలీవుడ్ లోనే రణ్ బీర్ తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు సందీప్. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించారు కూడా. యానిమల్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు ఈసినిమా సెట్స్ పైకి వెళ్లింది. హిమాచల్ ప్రదేశ్లోని మనాలీలో షూటింగ్ ను ప్రారంభించారు చిత్రయూనిట్. దీనిని భూషణ్కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, మురాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రైమ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాను 2023 ఆగస్టు 23న విడుదల చేయనున్నారు.
View this post on Instagram
కాగా అర్జున్ రెడ్డి , కబీర్ సింగ్ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఇటీవలే అలియాతో రణ్ బీర్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లయి పదిరోజులు కూడా కాకముందే ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా షూటింగ్లో జాయిన్ కావడంతో అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: