మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ‘ఆచార్య’. ఇక ఈసినిమాలో రామ్ చరణ్ కూడా సిద్ద అనే కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలే ఉండగా.. ఇప్పటివరకూ రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. ఇక ఏప్రిల్ 29న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఇక తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈసినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగానే నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను ఖరారు చేశారు. ఏప్రిల్ 23వ తేదీన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. హైద్రాబాద్ లోని యూసఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్స్ లో సాయంత్రం 6 గంటల నుండి ఈకార్యక్రమం ప్రారంభించనున్నారు. మరి ఈ ఈవెంట్ ముఖ్య అతిథిగా ఎవరొస్తారు అనేది తెలియాలి.
The stage is set for the MEGA SPECTACLE 🔥#AcharyaPreReleaseEvent on April 23rd from 6 PM 💥💥#AcharyaOnApr29
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @hegdepooja @SonuSood #Manisharma @NavinNooli @MatineeEnt @KonidelaPro @adityamusic pic.twitter.com/ZEkA4t0Cxb
— Konidela Pro Company (@KonidelaPro) April 21, 2022
కాాగా ఈసినిమాలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజా హెగ్డే
కనిపించనుంది. నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: