బెంగుళూరు జైన్ యూనివర్సిటీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ అయిన శ్రీనిధిశెట్టి అందాల పోటీలలో 2015 సంవత్సరం లో మిస్ కర్ణాటక, 2016 సంవత్సరంలో మిస్ దివా సుప్రనేషనల్ , మిస్ సుప్రనేషనల్ విన్నర్ గా నిలిచారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1″మూవీ తో శాండల్ వుడ్ లో కెరీర్ ప్రారంభించారు. ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని శ్రీనిధి శెట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. శ్రీనిధిశెట్టి కథానాయికగా తెరకెక్కిన “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న “కోబ్రా “మూవీ తో శ్రీనిధి కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. “కోబ్రా “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. శ్రీనిధి శెట్టి ప్రస్తుతం ఏ మూవీకీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. టాలీవుడ్ మేకర్స్ శ్రీనిధి ని టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ గ్రాండ్ సక్సెస్ తో శ్రీనిధి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ అందుకొనే అవకాశం ఉంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: