మెగాస్టార్ చిరంజీవి. మెగాపవర్స్టార్ రామ్ చరణ్ హీరోలుగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఆచార్య. ఈసినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29 విడుదల చేస్తున్నారు. దీంతో ఈసినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే పలు పాటలు, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించనున్నారు. హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ ఈసినిమా అనౌన్స్మెంట్ రోజు నుండే మెగా ఫ్యాన్స్, సినీ ప్రేక్షకులు అందరూ చిరంజీవిగారు, రామ్ చరణ్గారు పూర్తిస్థాయి చిత్రంలో కలిసి నటిస్తే ఎలా ఉంటుందో చూడాలని ఎదురు చూశారు. రీసెంట్గా విడుదలైన ట్రైలర్కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ను బట్టే సినిమాపై ఉన్న అంచనాలను ఊహించాం. ఎక్స్పెక్టేషన్స్ను మించేలానే సినిమాను రూపొందించాం. ఏప్రిల్ 29న మూవీ రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ 23న గ్రాండ్ లెవల్లో హైదరాబాద్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించబోతున్నాం. సన్నివేశాల్లో నటన, డాన్సులు, డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు ఇలా అన్ని ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. ఆచార్య చిత్రం కోసం ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎంత ఎగ్జయిటింగ్గా వెయిట్ చేస్తున్నారో మేం కూడా అంతే ఎగ్జయిట్మెంట్తో వెయిట్ చేస్తున్నాం’’ అన్నారు.
కాాగా ఈసినిమాలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజా హెగ్డే
కనిపించనుంది. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా… మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: