ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా ఒకటి. వంశీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది ఇటీవలే అభిషేక్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈనేపథ్యంలో ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. నిజానికి ఈసినిమా స్టూవర్ట్ పురం దొంగగా పేరుగాంచిన ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. దీంతో దొంగ కాబట్టి షూటింగ్ ఎక్కువ శాతం రాత్రిళ్లు మత్రమే జరిగే అవకాశం ఉంది. ఈసందర్భంగా మేకర్స్ తమ ట్విట్టర్ ద్వారా నైట్ షూట్.. ష్ అంటూ ఒక ఫొటో పోస్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Night Shoot Shushhhhh#TigerNageswaraRao 🐅 @AAArtsOfficial @DirVamsee pic.twitter.com/8YXZo7G9jG
— Abhishek Agarwal 🇮🇳 (@AbhishekOfficl) April 14, 2022
కాగా ఈసినిమాలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్పై అభిషేక్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు. రవితేజ కెరీర్ లో ఆయన నటిస్తున్న మొట్టమొదటి బయోపిక్ అలానే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే కావడం విశేషం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.
ఇక ఈసినిమా ఇండియన్ రాబిడ్ హుడ్గా పిలవబడే గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ అధారంగా తెరకెక్కనుంది. 1970-1980 దశకాల్లో నాగేశ్వరరావు ఆంధ్ర ప్రదేశ్లో భారీ ఎత్తున దొంగతనాలు, దోపిడీలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే వాడు. ఇలాంటి గజదొంగ కథ బయోపిక్గా తెరకెక్కుతుండటంతో ఈసినిమాపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. మరి చూద్దాం ఈసినిమా ఎలా ఉండబోతుందో..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: