సరైనోడు : గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రకుల్ ప్రీత్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “సరైనోడు ” మూవీ ఘనవిజయం సాధించింది. తన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, స్టైల్ తో అల్లు అర్జున్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా యాక్షన్స్ సీన్స్ , సాంగ్స్ లో హీరో అల్లు అర్జున్ అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. అల్లు అర్జున్ , ఆది ల క్లైమాక్స్ ఫైట్ ఈ మూవీ కి హైలైట్ గా నిలిచింది. మాస్ ఫైట్స్ , ఎమోషనల్ సీన్స్ తో “సరైనోడు ” మూవీ ని తెరకెక్కించి దర్శకుడు బోయపాటి తనదైన మేకింగ్ స్టైల్ తో ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దువ్వాడ జగన్నాథమ్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన యాక్షన్ కామెడీ “దువ్వాడ జగన్నాథమ్ “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దువ్వాడ జగన్నాథమ్ గా అల్లు అర్జున్ స్తోత్రాలు, మంత్రాలు చెబుతూ ఒక అచ్చమైన బ్రాహ్మణుడి బాడీ లాంగ్వేజ్, మాట తీరుతో ఆ పాత్రకు ప్రాణం పోశారు. హీరో అల్లు అర్జున్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ , పూజాహెగ్డే గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. డైలాగ్స్ , స్క్రీన్ ప్లే , కామెడీ తో ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ ని తెరకెక్కించి దర్శకుడు హరీష్ శంకర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
అల.. వైకుంఠపురములో ..: గీతా ఆర్ట్స్ , హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అల.. వైకుంఠపురములో”మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ లో అల్లు అర్జున్ చాలా స్టైలిష్ గా ఫ్రెష్ గా కనిపిస్తూ, కొన్ని కామెడీ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ టైమింగ్ తో, నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు. పూజాహెగ్డే తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎమోషనల్ , యాక్షన్ లతో ఈ మూవీ ని తెరకెక్కించి త్రివిక్రమ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
పుష్ప :ది రైజ్ : మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో ప్రపంచవ్యాప్తంగా సుమారు 370 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. .
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: