క్రిష్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న పీరియాడిక్ మూవీ హరిహర వీరమల్లు. ఈసినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లింది. ఇప్పటికే ఈసినిమా కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే కరోనా వల్ల ఈసినిమా షూట్ కు బ్రేక్ పడగా ఇప్పటివరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. చాలా గ్యాప్ తరువాత ఈ సినిమా కొత్త షెడ్యూల్ నేడు ప్రారంభమైంది. నేడు హైద్రాబాద్ లో ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలాఉండగా ఈసినిమా కోసం ఇప్పటికే భారీ భారీ సెట్స్ వేసిన సంగతి తెలిసిందే. 17వ శతాబ్దం నాటి పరిస్థితులను ప్రతిబింబించేలా పద్మశ్రీ తోట తరణి ఈ సినిమాకు సెట్స్ వేసినట్టు తెలుస్తుంది. ఇక ఈనేపథ్యంలో పవన్ కళ్యాణ్ నేడు తోట తరణి ని సత్కరించారు. నేడు షూటింగ్ సెట్ లో తోట తరణి గారికి పవన్ కళ్యాణ్ శాలువాతో సన్మానించారు. ఇప్పుడు ఈఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#HariHaraVeeraMallu shri @PawanKalyan garu felicitates the Legendary Art Director Padma Shri #ThotaTharani garu who is giving immense life to the sets as the shoot of @HHVMFilm resumes today 🤩@DirKrish @AgerwalNidhhi @mmkeeravaani @ADayakarRao2 @MegaSuryaProd pic.twitter.com/WpSwJOnE5I
— AM Rathnam (@AMRathnamOfl) April 8, 2022
కాగా ఈసినిమాలో పవన్ కళ్యాణ్కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: