వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్నయాక్షన్ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట “మూవీ మే 12 వ తేదీ రిలీజ్ కానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో “#SSMB 28 “మూవీ పూజాకార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో మహేష్ బాబు కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా మూవీ కి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సీనియర్ యాక్టర్స్ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు పలు మల్టీ స్టారర్ మూవీస్ లో నటించిన విషయం తెలిసిందే. తరువాత జనరేషన్ యాక్టర్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున కలిసి నటించలేదు. తాజాగా ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన మల్టీ స్టారర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ ఘనవిజయం సాధించడంతో టాలీవుడ్ లో తిరిగి పలు మల్టీ స్టారర్ మూవీస్ తెరకెక్కే అవకాశం ఉంది.
మల్టీ స్టారర్ మూవీస్ గురించి మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ..ఎన్టీఆర్, రామ్ చరణ్ లలో ఎవరితోనైనా మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమేనని చెప్పారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్ నటిస్తే దేశంలోనే అది క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది అనడంలో సందేహం లేదు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: